బ్రాహ్మణులకు కులదృవీకరణ పత్రాలపై జీవో విడుదల.
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ హర్షం.
తెలంగాణా ప్రాంతంలోని బ్రాహ్మణులందరూ సమీపంలోని ఈ సేవా కేంద్రాలలో బ్రాహ్మణ కుల ధృవీకరణలు పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్లు గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, పిల్లుట్ల ఆనంద్ మోహన్ లు పిలుపునిచ్చారు.
రాష్ట్రం లోని అన్నికులాలకు ఇచ్చేవిధంగా ఓసీలైన బ్రాహ్మణులకు కూడా కులదృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం జీఓ విడుదలచేసింది.
ఇప్పటి వరకూ ఈ దృవీకరణ పత్రాలు అందుబాటులో లేక పోవడంతో ఆ ఫలాలు ఎవ్వరూ పొందలేకపొవడంతో ప్రభుత్వం యుద్దప్రాతిపదికన ఈ జీఓను విడుదల చేసింది.
తెలంగాణా బ్రాహ్మిణ్ సంక్షేమ పరిషద్ ఫలాలు పొందాలనుకునేవారు సమీప ఈసేవ లో కుల, ఆదాయ, స్థానిక దృవీకరణలు పొంది TBSP ఫలాలు అందుకోవాలని వారు విజ్ఙప్తిచేశారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణులకు కూడా కులదృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు జీఓ జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమత్రి కెసీఆర్ గారికి, అందుకు కృషిచేసిన తెలంగాణా బ్రాహ్మిణ్ సంక్షేమ పరిషద్ చైర్మన్ రమణాచారి గారికి బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్లు గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, పిల్లుట్ల ఆనంద్ మోహన్ లు కృతజ్ఙతలు తెలిపారు.
ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
కో-ఆర్డినేటర్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్
9700007653

No comments:
Post a Comment