Thursday, March 29, 2018

విడుదలకు నోచుకోని బ్రాహ్మణ పరిషద్ నిధులు - మూల్గుతున్న మూడొందల కోట్లు



మూడొందల కోట్లున్నా ప్రారంభం కాని పలు పథకాలు...  నిరాశ నిస్పృహ లో పేద బ్రాహ్మణులు...


 పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంవత్సరానికి వందకోట్ల నిధులు మంజూరు చేసినప్పటికి అవి ఇంకా మంజూరుకు నోచుకోకపోవడం బాధాకరమని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్  కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

పేద బ్రాహణులు ఇప్పటికే వ్యాపారాల కోసం, పిల్లల విదేశీ చదువులకోసం ఎన్నో ఆశలతో దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటివరకు వారికి ఎలాంటి సహాయం అందకపోగా కనీసం ఎప్పటివరకు అందుతాయోకూడా తెలియక అయోమయం ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

 దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యని విధంగా తెలంగాణా బ్రాహ్మణ సంక్షేమ పరిషద్ నిధుల దుస్థితి ఉందని కృష్ణమోహన్ తెలిపారు.

హెల్త్ ఇన్సూరెన్సు కార్డులు కొంతమందికి ఇచ్చారని, ఇలాగే ఇతర సంక్షేమ పథకాలు కూడా పేద బ్రాహణులందరికీ చేరే విధంగా త్వరతిగతిన పరిషద్ సభ్యులు, సంబందిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఙప్తి చేశారు.


Sunday, February 11, 2018

గోగినేనీ... గోల తగ్గించు... గోగులపాటి కృష్ణమోహన్ సూచన

http://telanganareporter.news/గోగినేనీ-గోల-తగ్గించు/

*గోగినేనీ... గోల తగ్గించు...* 

ఇటీవల కొన్ని ఛానల్స్ లో అతిధిగా పాల్గొంటూ మూఢనమ్మకాల పేరుతో హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కించపరుస్తున్న గోగినేని బాబు తన తీరుమార్చుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గోగులపాటి కృష్ణమోహన్ హెచ్చరించారు.

టీవీలలో తానే మేధావిననే భావంతో వితంఢవాదం చేస్తూ వాస్తవాలను అవాస్తవాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడని కృష్ణమోహన్ ఆరోపించారు.

తన సైన్స్ పరిజ్ఙానంతో పంచభూతాలను, జీవాజాలని పుట్టించగలడా అని కృష్ణమోహన్ ప్రశ్నించారు.

ఎక్కడో, ఎవరో మాయమాటలతో మోసం చేస్తున్నారని అన్నిటినీ మాయ, మోసం అనడం తగదని హితువుపలికారు.

వాస్తవాలన్నింటినీ చూడలేమని, చూసేవన్నీ వాస్తవాలు కావని... నీ ఎదురుగా ఉన్న గాలినే నీవు చూడలేనివాడివి దేవుడిని ఎలా చూడగలవని ప్రశ్నించారు. నీ తండ్రి అని నీ తల్లిచెబితే తప్ప నీకు నీ తండ్రెవరో తెలియదని, అంతమాత్రాన అది వాస్తవం కాకుండా పోదని,  ఇలాంటి వాస్తవాలు గోగినేని తెలుసుకోవాలని, కొన్నిటిని నమ్మకతప్పదని హితువు పలికారు.

ఇకనుండి ఛానల్స్ లో పాల్గొని  నాన్సెన్స్, నాన్సెన్స్ అంటూ న్యూసెన్స్ చేయడం మానుకోవాలని, పెద్దలపట్ల గౌరవంగా నడుచుకోవడం నేర్చుకోవాలని కృష్ణమోహన్ గోగినేనికి సూచించారు.

హిందుత్వం అనేది ఒకమతంలా కాకుండా అదొక జీవనవిధానంగా చూడాలని ఆయన అన్నారు. 

జ్యోతిష్యం, పంచాంగాలతోపాటు హిందువుల ఆచారవ్యవహారాల జోలికి రాకుండా ఉంటే మంచిదని కృష్ణమోహన్ పేర్కొన్నారు.

ఛానల్స్ వారు కూడా తమ టిఆర్పి రేట్ పెంచుకోవడం కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాంటి కార్యక్రమాలను ప్రసారం చేయకుండా ఉంటే ఎంతో గౌరవంగా ఉంటుందని గోగులపాటి కృష్ణమోహన్ అభిప్రాయపడ్డారు.


ఆచారి అమెరికా యాత్ర - అభ్యంతరాలుంటే సహించేదిలేదు

https://youtu.be/6T3j_TQtPGc

అభ్యంతరాలు ఉంటే సహించేదు లేదు
ఆచారి అమేరికా యాత్ర సినిమా యూనిట్ కు బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ హెచ్చరిక

పద్మజా పిక్చర్స్‌ పతాకంపై జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలోమంచు విష్ణు హీరోగా వస్తున్న కొత్త సినిమా 'ఆచారి అమెరికా యాత్ర' లో బ్రాహ్మణులను కించపరిచే లేదా మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉంటే సహించేదిలేదని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్  తీవ్రంగా హెచ్చరించింది.

ఇటీవల సినిమాలు ఏదో కులాన్ని, వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీస్తున్నారని, సినిమాలు వినోదాత్మకంగా ఉండాలే తప్ప వివాదస్పదంగా మారకూడదని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గోగులపాటి కృష్ణమోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆచారి అమేరికా యాత్ర వినోదాత్మకంగా ఉంటే పర్వాలేదని... బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా ఉండకుండా సెన్సార్ బోర్డు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పత్రికాముఖంగా పేర్కొన్నారు.