Thursday, September 29, 2016

లోహియా గ్రూపు ఆద్వర్యంలో జల్ శుధ్

 లోహియా గ్రూపు ఆద్వర్యంలో జల్ శుధ్

పర్యావరణ పరిరక్షణ - చెరువుల సంరక్షణ లో భాగంగా లోహియా గ్రూపు ఆద్వర్యంలో చేపట్టిన జల్ శుద్ద్ కార్యక్రమం దుర్గం చెరువు వద్ద గురువారం చేపట్టారు.

సంస్థ ఎండీ మహావీర్ లోహియా డైరెక్టర్ మిథేష్ లోహియాలు  మాట్లాడుతూ తెలంగాణ లో బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకొని చెరువులను పరిశుద్ధంగా ఉంచేందుకు జలశుధ్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నగరంలో ఏడు ప్రధాన చెరువులతో పాటు, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో తొమ్మిది చెరువులను ఎంచుకొని అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ వ్యాపారసంస్థలు లాభాపేక్షతో కాకుండా సామాజిక సేవా దృక్పథంతో కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. బతుకమ్మ పండుగ లో వాడే ప్రకృతి సిద్దమైన పూలలో కలుషిత జలాల శుద్దికి ఉపయోగపడే గుణాలు ఎన్నో ఉంటాయని అన్నారు.
అయితే చెరువులతో పాటు వాటి పరిసరాలు కూడా పరిశుబ్రంగా ఉండేలా ప్రజలలో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు.

లోహియా మార్కెటింగ్ మేనేజర్ పిల్లుట్ల ఆనంద్ మోహన్  ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ప్రతినిధి శ్రీనివాస్, ఎన్జీవో ప్రతినిధులు దీక్షితులు, సంస్థ ప్రతినిధులు నారాయణరావు, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.





No comments:

Post a Comment