Sunday, August 7, 2016

పుష్కర పవిత్రతను పరిరక్షిద్దాం

పుష్కర పవిత్రతను పరిరక్షిద్దాం



పుష్కర పవిత్రతను పరిరక్షిద్దాం..
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ పిలుపు


కృష్ణ పుష్కరాలను పురస్కరించుకొని బ్రాహ్మిణ్స్ యూనిటి ఫరెవర్ వాలెంటరీల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా లోహియా గ్రూపు వారు ప్రత్యేకంగా రూపొందించిన టీ షర్టులను కో-ఆర్డినేటర్లు అలూరి, గోగులపాటి కృష్ణమోహన్, పిల్లుట్ల ఆనంద్ మోహన్ లు వాలెంటరీలకు  అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉత్సాహవంతులైన యువకులు సేవాకార్యక్రమాలలో పాల్గొని పుష్కరాలను విజయవంతం చేయడానికి ముందుకురావడం ముదాహమని పేర్కొన్నారు. పుష్కరసమయంలో పవిత్ర నదీజలాలు అపవిత్రం కాకుండా చూడాల్సిన భాద్యత మనపై ఎంతోఉందని సూచించారు. 

భక్తులు షాంపూలు, సబ్బులు, బట్టలు ఉతకడాల వలన నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని కావున వీటిపై భక్తులకు అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు.

ముఖ్యంగా పుష్కరాలకు వచ్చే వృద్దులు, పిల్లల పట్ల ప్రత్యేకశ్రద్ద వహించాలని పేర్కొన్నారు. భక్తులు ప్లాస్టిక్ వాడకాలు నిరోదించి పర్యావరణాన్ని కాలుష్యకోరలనుంచి కాపాడి పుష్కర పవిత్రతకు భంగము వాటిల్లకుండా చూసుకోవాల్సిన భాద్యత మనందరి పై ఉందని సూచించారు.

కార్యక్రమంలో బ్రాహ్మిణ్స్ యూనిటీ వాలెంటరీలు, సమూహసభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment