Wednesday, July 12, 2017

బ్రాహ్మణ కులదృవీకరణ అందజేత






బ్రాహ్మణ కులదృవీకరణ అందజేత

తెలంగాణ ప్రబుత్వం బ్రాహ్మణులకు జీవో ఎమ్. ఎస్ నం. 105, ప్రకారం విడుదల చేసిన కుల దృవీకరణ మొదటి పత్రాన్నికుత్భుల్లాపూర్ కు చెందిన గోగులపాటి కృష్ణమోహన్ బుధవారం స్థానిక ఎమ్మార్వో వి భూపాల్, సూపరిమడెంట్ జనార్ధన్ రావుల చేతులమీదుగా అందుకున్నారు.

ఈ సందర్భంగా బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ తెలంగాణా బ్రాహ్మణ సంక్షేమ పరిషద్ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలకోసం కులదృవీకరణ పత్రం కీలకమని, దానికోసం ఇంతకాలంగా ఎదురుచూశామని అన్నారు.

ఇక బ్రాహ్మణ బందువులంతా ఆలస్యం చేయకుండా కులదృవీకరణకోసం స్థానిక మీ/ఈ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

బ్రాహ్మణులకు కులదృవీకరణ అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కృషిచేసిన టిబిఎస్పీ చైర్మన్ రమణాచారి గారికి కృతజ్ఙతలు తెలిపారు.

కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు రమేష్ సర్వేపల్లి, సంజీవ్ రావు, భరత్ శ్రీవాత్సవ్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment